పబ్లో యువతి పై మందుబాటిళ్లతో దాడి
byసూర్య |
Tue, Jun 21, 2022, 10:33 AM
హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో పబ్లో దారుణం జరిగింది. పబ్కు స్నేహితురాలితో కలిసి వెళ్లిన యువతిపై కొందరు యువకులు మందుబాటిళ్లతో ఆదివారం రాత్రి దాడి చేశారు. అత్యాచారం కూడా చేస్తామని బెదిరించారు. ఫోన్ నంబర్ అడిగితే ఇవ్వలేదని 8 మంది యువకులు తమపై వేధింపులకు పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపిస్తోంది. వారిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News