byసూర్య | Tue, Jun 21, 2022, 09:34 AM
ఐజ పట్టణంలో మంగళవారం అంతర్జాతీయ యోగ డే ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో జడ్. పి. హెచ్. ఎస్ బాయ్స్ నందు యోగ డే నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి యోగ మానవునికి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది అని అన్నారు. యోగా అనే ప్రక్రియను మన పూర్వీకులు మనకు అందించినందుకు వారికి ఈనాటి సమాజం జన్మంతా రుణపడి ఉండాలి. భారతదేశంలో పుట్టిన యోగా ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసి దాని ప్రాధాన్యతను వివరించి మెప్పించి జూన్ ఇరవై ఒక్కటి ను అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటింప చేసి భారత ఖ్యాతిని మరియు కీర్తిని పెంచిన నరేంద్ర మోడీకి భారతీయులందరూ జన్మాంతం రుణపడి ఉండాలి అని అన్నారు.