byసూర్య | Mon, May 23, 2022, 09:51 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 12,017 నమూనాలను పరీక్షించగా 27 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్లో ఎక్కువగా 17 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 52 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్త మరణాలు లేవు.తెలంగాణలో ఇప్పటివరకు 7,92,898 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,415 మంది ఆరోగ్యంగా ఉన్నారు. మరో 372 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.