మరింత యాక్టివ్ గా టీ పీసీసీ సోషల్ మీడియా టీం

byసూర్య | Mon, May 23, 2022, 08:28 PM

కాలంతో పాటు పరిగెత్తకపోతే  ఎవరైనా వెనకబడాల్సిందే. అందుకే తాజాగా తెలంగాణ కాంగ్రెస్  నాయకత్వం తన సోషల్ మీడియా టీంను మరింత యాక్ట్యూవ్ గా నడపాలని నిర్ణయించింది. ఇదిలావుంటే  మ‌ల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత  టీ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా చాలా యాక్టివ్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్లిన త‌ర్వాత ఈ బృందం మ‌రింత యాక్టివ్ అయిపోయింది. ప్ర‌తి అంశం మీద క్ష‌ణ కాలం కూడా ఆల‌స్యం చేయ‌కుండా పార్టీ వైఖ‌రిని వెల్ల‌డిస్తూ సాగుతున్న ఈ బృందం చ‌ర్య‌ల‌తో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉందో  ఇటీవల విడుదలైన  ఓ పోటో తెలియజేస్తోంది. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా టీ కాంగ్రెస్ కార్యాల‌యం గాంధీ భ‌వ‌న్ మెట్ల ముందు ఓ జ‌న స‌మూహం క‌నిపించింది. దాదాపుగా 40 మందితో కూడిన ఈ బృంద‌మే టీ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా బృంద‌మ‌ట‌. ఈ విష‌యాన్ని ఆ బృందం స‌భ్యుడు, న‌వీన్ అనే వ్య‌క్తి వెల్ల‌డించారు.  


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM