తెలంగాణ సొమ్ము ఏమైనా మీ తాత జాగీరా: వై.ఎస్.షర్మిల

byసూర్య | Sun, May 22, 2022, 02:56 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా అని సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధినేత్రి ష‌ర్మిల విమర్శలు గుప్పించారు. ''తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి, విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసల్ రావు కానీ తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా?  అంటూ నిలదీశారు. ఇదిలావుంటే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు పంజాబ్ లో ప‌ర్య‌టించి రైతుల కుటుంబాల‌కు సాయం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన షర్మిల  తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.


పంట దిగుబడి లేక, పెట్టుబడి రాక మీరు ఆదుకొంటారనే ఆశ చచ్చి సిద్ధిపేట రైతు మల్లేశం ఆత్మహత్య చేసుకొన్నాడు. 11 లక్షల అప్పు తెచ్చి పంచాయతీ పనులు చేస్తే చేసిన పనులకు బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సర్పంచ్ ఎల్లయ్య చావడానికి ప్రయత్నించిండు. దేశాన్నేలపోవాలన్న మీ దురదకు తెలంగాణ బిడ్డల ముంచకు దొరా'' అని ష‌ర్మిల ట్వీట్ చేశారు. 


Latest News
 

చలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు Thu, Mar 28, 2024, 04:30 PM
కారేపల్లి క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిపి Thu, Mar 28, 2024, 04:30 PM
మధిర ప్రజలకు ముఖ్య సూచనలు చేసిన మున్సిపల్ కమిషనర్ Thu, Mar 28, 2024, 04:29 PM
బొడ్రాయి మహోత్సవానికి ఎమ్మెల్యే Thu, Mar 28, 2024, 04:28 PM
బ్యాక్ లాగ్ ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ Thu, Mar 28, 2024, 04:27 PM