ముగిసిన ఒకేషనల్ పరీక్షలు
byసూర్య |
Sun, May 22, 2022, 09:55 AM
ఇంటర్మీడియట్ వృత్తివిద్యా కోర్సు వార్షిక పరీక్షలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున రెండో సంవత్సరం భౌతిక సైన్సు పత్రం-2 పరీక్ష జరిగింది. వనపర్తి జిల్లాలో పరీక్షకు మొత్తం 613 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా, 567 మంది హాజరయ్యారని, 46 మంది గైర్హాజ రైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ప్రకాశంశెట్టి తెలి పారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు జాకీర్ హుసేన్తో కలిసి ఆయన జిల్లా కేంద్రంలో పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. పరీక్షల ముఖ్య పర్యవేక్షకులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ ఇతర సిబ్బంది సహకారంతో సజావుగా నిర్వహించామని పేర్కొన్నారు.
Latest News