సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన.. నేడు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ.

byసూర్య | Sat, May 21, 2022, 01:54 PM

కేసిఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో శనివారం భేటీకానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. పదిరోజుల పర్యటనలో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్‌. చండీగఢ్ వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన ఆరు వందల రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శిస్తారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
ఈనెల 26న బెంగళూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమార స్వామితో భేటీ అవుతారు. 27న సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలో పర్యటిస్తారు. రాలేగావ్ సిద్ధిలో అన్నహజారేతో భేటీ అవుతారు. మే 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్‌లో సీఎం కేసీఆర్ పర్యటన సాగుతుంది. గల్వాన్ లోయలో అమరులైన సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. సైనిక కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM