భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

byసూర్య | Sat, May 21, 2022, 01:30 PM

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయిని ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఝార్ఖండ్‌కు కారులో భద్రాచలం మీదుగా దుండగులు గంజాయిని తరలిస్తున్నారు.ఈ క్రమంలో భద్రాచలం శివారు ప్రాంతంలో కారును ఆపేందుకు ఎక్సయిజ్ శాఖ సిబ్బంది ప్రయత్నించింది. అయితే ఇద్దరు దుండగులు కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. అనంతరం రామాలయం ప్రాంతంలో గంజాయితో సహా కారును వదిలేసి పరారయ్యారు. కారుతో పాటు కారులో ఉన్న సుమారు 150 కేజీల గంజాయి ప్యాకెట్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది.


Latest News
 

ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి Thu, Apr 18, 2024, 10:23 AM
కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ Thu, Apr 18, 2024, 10:11 AM