byసూర్య | Sat, May 21, 2022, 01:25 PM
హైదరాబాద్ లోని షాహి నాథ్ గంజ్ లో శుక్రవారం జరిగిన పరువు హత్యకు నిరసనగా నేడు బేగం బజార్ బంద్ కు పిలుపునిచ్చారు వ్యాపారులు . ఈ మేరకు ధర్నాకు దిగారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. అయితే ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి సోదరులు, వారి స్నేహితులు కలిసి ఈ హత్యకు పాల్పడ్డారని తెలిసింది. నలుగురిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో నీరజ్ మృతదేహం ఉంది.. మరికొద్దిసేపట్లో నీరజ్ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేయనున్నారు వైద్యులు.