నేడు బేగంబజార్ బంద్

byసూర్య | Sat, May 21, 2022, 01:25 PM

హైదరాబాద్ లోని షాహి నాథ్ గంజ్ లో శుక్రవారం జరిగిన పరువు హత్యకు నిరసనగా నేడు బేగం బజార్ బంద్ కు పిలుపునిచ్చారు వ్యాపారులు . ఈ మేరకు ధర్నాకు దిగారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. అయితే ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి సోదరులు, వారి స్నేహితులు కలిసి ఈ హత్యకు పాల్పడ్డారని తెలిసింది. నలుగురిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో నీరజ్ మృతదేహం ఉంది.. మరికొద్దిసేపట్లో నీరజ్ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేయనున్నారు వైద్యులు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM