byసూర్య | Thu, May 19, 2022, 09:36 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 12,458 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 47 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్లో అత్యధికంగా 36 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, సంగారెడ్డి జిల్లాలో 1, సూర్యాపేట జిల్లాలో 1, నారాయణపేట జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 1 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో కొత్త మరణాలు లేవు.తెలంగాణలో ఇప్పటివరకు 7,92,757 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,250 మంది ఆరోగ్యంగా ఉన్నారు. మరో 396 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.