రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు!

byసూర్య | Thu, May 19, 2022, 05:03 PM

తెలంగాణలోని ఓ రేకుల ఇంటికి రూ.7 లక్షల కరెంటు బిల్లు రావడం కలకలం రేపింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. లక్ష్మీదేవిపల్లి హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ కుటుంబం ఓ రేకుల ఇంటిలో నివాసం ఉంటోంది. అయితే ఎప్పుడూ లేనంతగా తన ఇంటికి రూ.7 లక్షల కరెంటు బిల్లు రావడంతో సంపత్ షాక్ తిన్నాడు.

గత నెలలో సంపత్ కుటుంబం 117 యూనిట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగించింది. అన్ని యూనిట్లకు గాను రూ.7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. లక్షల్లో బిల్లు రావడమేంటని సంపత్ వెంటనే బిల్లు కలెక్టర్ ను కూడా అడిగినా వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని సంపత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు మామూలుగా అయితే రూ. 400 వరకు కరెంట్ బిల్లు వచ్చేదని, ఇప్పుడు ఇలా రావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక ఫ్యాన్, టీవీ ఉన్న రేకుల ఇంటికి ఇలా రూ. 7.2 లక్షల కరెంట్ బిల్లు రావడంతో స్థానికులు అధికారుల తీరుపై ఫైర్ అవుతున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM