byసూర్య | Thu, May 19, 2022, 03:39 PM
తెలంగాణలో పెరిగిన మద్యం ధరల పై ఎక్సైజ్ శాఖ క్లారిటినిచ్చింది. తెలంగాణలో అన్ని రకాల బీర్ల పై రూ.10 పెంచారు. రూ.200 లోపు ఉన్న క్వాటర్ల పై రూ.20 పెంచారు. రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న క్వాటర్ల పై రూ.40 పెంచారు. రూ.200 లోపు ఉన్న వైన్ క్వాటర్ల పై రూ.10 పెంచినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. వెయ్యి ఎంఎల్ లిక్కర్పై రూ. 120 పెంచడంతో.. ధర రూ. 495 నుంచి రూ. 615కు పెరిగింది.