byసూర్య | Tue, May 17, 2022, 09:57 PM
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనతో కలిసి పనిచేస్తే మందకృష్ణ ను మంత్రిని చేస్తానని కేఏ పాల్ అన్నారు. ఏళ్ల తరబడి పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఏం సాధించారని కేఏ పాల్ ప్రశ్నించారు. విద్యావంతులు మా పార్టీలో చేరాలని... ఇప్పుడున్న పార్టీలన్నీ అవినీతి మయమే అని., నాకు 2012లో అమిత్ షా ఎంపీ సీటు, మంత్రి పదవి ఇస్తామని వచ్చినా తిరస్కరించానని కేఏ పాల్ అన్నారు.