byసూర్య | Tue, May 17, 2022, 06:46 PM
ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ షర్మిల పిలుపు మేరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మల్కాజిగిరి నాయకులు ఎం.ఫ్రాన్సిస్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సేపూరి ప్రవీణ్ కుమార్, శివ యాదవ్, రవితేజ, ఎస్పీ స్వామి, శ్రీను, కార్తీక్, అభిలాష్, జాషువా, మోసెస్, శాంసన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.