byసూర్య | Tue, May 17, 2022, 06:22 PM
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ డిక్లరేషన్ అమలు కావడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఏపంట వేస్తే లాభం ఉంటుందో రైతులు ఆలోచించాలని కోరారు. వరి మినహా ఇతర పంటలు సాగుచేసిన రైతులంతా లాభపడ్డారని పేర్కొన్నారు. ఫామాయిల్ సాగు లాభదాయకమని, తాను కూడా 20ఎకరాలు సాగుచేశానని తెలిపారు. ఎన్టీఆర్, కేసీఆర్ తనకు నచ్చిన ముఖ్యమంత్రులని పేర్కొన్నారు.