byసూర్య | Tue, May 17, 2022, 05:07 PM
ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఖమ్మంలో టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై మంగళవారం ఖమ్మంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. జడ్పీ సెంటర్లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.