byసూర్య | Tue, May 17, 2022, 05:03 PM
జేబు దొంగతనాలు చేసే ఎనిమిది మంది అంతర్ రాష్ట్ర నిందితుల ముఠాను పోలీసులు అరెస్టు చేసారు. రెమా రాజేశ్వరి ఐ.పి.ఎస్, ఎస్పీ మాట్లాడుతూ రాజకీయ పార్టీ సభలు, జనసమూహము ఎక్కువగా ఉండే ప్రదేశాలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుండి నగదు 6, 00, 000/- రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించే ఒక ఫోర్డ్ కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.