byసూర్య | Tue, May 17, 2022, 03:35 PM
మంత్రి కేటీఆర్ పది రోజుల విదేశీ పర్యటన నిమిత్తం నేడు లండన్ వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి పర్యటన సాగనుంది. లండన్లో పలు కంపెనీల అధినేతలు, సీఈవోలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్ చేరుకుంటారు. దావోస్లో ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు మంత్రి హాజరుకానున్నారు. సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు వివిధ కంపెనీల అధిపతులు, సీఈవోలతో సమావేశమవుతారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వారితో చర్చించేందుకు రాష్ట్రానికి ఆహ్వానిస్తామన్నారు. అనంతరం ఈ నెల 26న తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.