byసూర్య | Tue, May 17, 2022, 02:49 PM
ఇంటింటికి తాగునీటిని అందించిన మిషన్ భగీరథ పథకం విజయవంతమైందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం అమీర్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని బీహెచ్ఈఎల్ మెట్రో ఎంక్లేవ్ లో ఏర్పాటు చేయనున్న మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.