రైలు ఢీకొని వ్యక్తి మృతి
byసూర్య |
Tue, May 17, 2022, 01:30 PM
సికింద్రాబాద్ భార్య పిల్లలను సురక్షితంగా పట్టాలు దాటించి చివరగా తాను దాటే ప్రయత్నంలో వేగం గా వచ్చిన రైలు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. ఒడిస్సా రాష్ట్రం గంజామ్ జిల్లాకు చెందిన సంతోష్ ప్రధాన్ (37) తన భార్య సుద్ద, ఎనమిది, ఐదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలతో ఉపాధికోసం నగరానికి వచ్చి చర్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. కూరగాయలు కొనేందుకు రాత్రి 9 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు దాటి సమీపంలోని మార్కెట్కు భార్యాపిల్లలతో కలిసి వెళ్లాడు. కొనుగోలు అనంతరం తిరిగి పట్టాలు దాటే క్రమంలో వేగంగా చార్మినార్ ఎక్స్ప్రెస్ రాకను గమనించిన సంతోష్ భార్యాపిల్ల లను క్షేమంగా పట్టాలు దాటించి చివరగా తాను దాటే ప్రయత్నంలో రైలు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సంతోష్ భార్యాపిల్లల ముందే మృతి చెం దాడు. రైలు డ్రైవర్ సమాచారం మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News