byసూర్య | Tue, May 17, 2022, 12:20 PM
జీతం డబ్బులు తెచ్చి ఇవ్వలేదన్నందుకు తండ్రి మందలించాడని మనస్తాపం చెంది రైలు కిందపడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి శివారులో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలంలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన అటెం ప్రవీణ్ కుమార్(22) అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. తండ్రి యాదగిరి జీతం డబ్బులు తీసుకురాలేదని మందలించినందుకు గుర్తుతెలియని రైలు కింద పడి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులుతెలిపారు.