byసూర్య | Tue, May 17, 2022, 10:40 AM
విద్యా వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు మన ఊరు-మన బడి కార్య క్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాయపోల్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో మన ఊరు-మన బడి పథకం కింద 121 కోట్లతో చేపట్ట నున్న పాఠశాల పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మండలంలో వివిధ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, భవనాల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని ఈ పనులను రాయపోల్ గ్రామం నుంచి ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా 9 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జెడ్పీటీసీ మహిపాల్, సర్పంచ్ బల్వంత్ రెడ్డి, పీఆర్ఎస్ఈ ఇంద్రసేనారెడ్డి, ఎంపీ టీసీలు శ్రీశైలం, జ్యోతి, ఎంపీడీఓ క్రాంతికిరణ్, ఎంఈఓ వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్ పాల్గొన్నారు.