byసూర్య | Tue, May 17, 2022, 09:04 AM
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు కొడంగల్ ఎస్సై రవి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం కొడంగల్ మండల పరిధిలోని ఆలేడు గ్రామ శివారు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలించడం నేరమని తెలిపారు.