byసూర్య | Tue, May 17, 2022, 08:51 AM
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివారులోని ఇస్లాంపుర కాలనీకి చెందిన అబ్దుల్ మీరజ్ (14) కాలనీలో గల ఇనుప స్తంభాన్ని తాకగా కరెంట్ షాక్ కొట్టడంతో వెంటనే తల్లిదండ్రులు ఎంజె హాస్పటిల్ కి తరలించారు. కరెంట్ స్తంభం యొక్క డ్యామేజ్ అయిన సర్వీస్ వైరును విద్యుత్ శాఖ కి చెందినవారు ఇనుప స్థంభానికి నిర్లక్ష్యంగా చుట్టి వుండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడి తండ్రి అబ్దుల్ ఖయ్యూమ్ సోమవారం రాత్రి పిర్యాదు చేసినట్లు సీఐ శ్రీకాంత్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.