byసూర్య | Tue, May 17, 2022, 08:47 AM
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేశారు దుండగులు. ఐదు తులాల బంగారం, 60 వేయిల నగదు ను సోమవారం రాత్రి దొంగలు దోచుకెళ్లారు. కమలాపురం బెల్ట్ ఫ్యాక్టరీ మూతపడడంతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారే ఈ దొంగతనానికి పాల్పడ్డారని ఇంటి యజమాని వినయ్ ఆరోపిస్తున్నారు. తన తల్లిదండ్రులను చూసి వచ్చేందుకు హైదరాబాద్ వెళ్లగ ఈ దొంగతనం జరిగినట్లు తెలిపారు.