byసూర్య | Tue, May 17, 2022, 08:46 AM
కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న న్యాయశాస్త్రం, ఎంసీఏ పరీక్షల్లో సోమవారం ఆరుగురు విద్యా ర్థులు డిబారైనట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్ రాధిక వెల్లడించారు. కేయూ ఎస్డీఎల్సీ కేంద్రంలో న్యాయశాస్త్రం కోర్సుల్లో నలుగురు, ఎంసీఏలో ఒక్కరు, ఖమ్మంలో న్యాయశాస్త్రంలో ఒకరు మాస్ కాపీయింగ్ పాల్పడుతుండగా తనిఖీ బృందాలు డిబార్ చేసినట్లు స్పష్టం చేశారు.