byసూర్య | Tue, May 17, 2022, 08:36 AM
నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మరణించాడని, వ్యక్తి మరణానికి కారణమైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పై చర్యలు తీసుకోవాలని, వ్యక్తి బంధువులు సోమవారం సాయంత్రం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువసేన రాష్ట్ర అధ్యక్షులు శింకారు శివాజీ పాల్గొని మద్దతు తెలిపారు.