byసూర్య | Tue, May 17, 2022, 08:35 AM
నాగర్ కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, రామాజిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై సోమవారం మధ్యాహ్నం దాడి జరిగిందని గ్రామ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పథకంలో పనులు పరిశీలించడానికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన గణేష్, అతడి తల్లి తిరుపతమ్మ దాడి చేసి గాయపరిచారని ధనరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందం గౌడ్ మంగళవారం తెలిపారు.