byసూర్య | Tue, May 17, 2022, 08:25 AM
అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడితే చర్యలు తప్పవని నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి హెచ్చరించారు. ఫ్లెక్సీలు పెట్టే వారు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో వ్యాపారస్తులు దుకాణదారులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి వ్యాపార వాణిజ్య అనుమతులు తీసుకోవాలని లేనిపక్షంలో పురపాలక చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.