byసూర్య | Mon, May 16, 2022, 03:00 PM
హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్నపేట చౌనిలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతవాసులు ఏమయ్యిందోనని ఉలిక్కిపడ్డారు. అయితే.. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ బారి శబ్ధంతో పేలడంతోనే ఇట్లా జరిగిందని తెలుస్తోంది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. మంటల దాటికి రెండు ఇండ్లు, ఒక ఆటో పూర్తిగా కాలిపోయాయి. కాగా, ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటాలార్పుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..