సేవాభావంతో వైద్యసేవలు అందించాలి: ఎమ్మెల్యే
byసూర్య |
Mon, May 16, 2022, 02:09 PM
పేదలకు సేవాభావంతో వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం లో ఇషా ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గంలో స్థాపించే ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యలు వ్యాపార దృక్పధంతో కాకుండా గ్రామీణ పేదలకు సేవాభావంతో వైద్య సేవలందించాలని సూచించారు.
నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుండటంతో పలు పరిశ్రమలు, ఆస్పత్రులు, అనేక సంస్థలు ఈ ప్రాంతానికి వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, టీఆర్ఎస్ అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ఎంపీటీసీ నాగమణి, టీఆర్ఎస్ నాయకులు కేవీ. రమేష్ రాజు, రాజు, జగదీశ్, మల్లేష్, ఆస్పత్రి డైరెక్టర్ సంపత్, మహేందర్ పాల్గొన్నారు.
Latest News