byసూర్య | Mon, May 16, 2022, 01:58 PM
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. జిల్లాలోని కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామ శివారులో తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.గుర్తు తెలియని ఓ లారీ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తల, మొండెం వేరు అయ్యాయి దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాజారామ్ తండాకు చెందిన బానోత్ రవి గా గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.