విజయవాడ డ్రగ్స్‌ కేసులో కీలక వివరాలు సేకరణ

byసూర్య | Mon, May 16, 2022, 12:31 PM

విజయవాడ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్ సరఫరా చేసిన కేసులో నిందితుడు అరుణాచలంను పోలీసులు విచారిస్తున్నారు.నేటితో అరుణాచలం మూడు రోజుల పోలీస్‌ కస్టడీ ముగియనుంది. ఎఫిడ్రిన్ అక్రమ రవాణాలో కీలక నిందితుల వివరాలను పోలీసులు సేకరించారు.ఆస్ట్రేలియా- సిడ్నీలోని రామన్ తంగేవికి అరుణాచలం డ్రగ్స్‌ పార్శిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై బర్మాబజార్‌లో ఇద్దరు వ్యక్తులు తనకు పార్శిల్ ఇచ్చినట్లు అరుణాచలం పోలీసులకు వివరించాడు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. దీంతో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు చెన్నైలో గాలింపు చేపట్టారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM