byసూర్య | Mon, May 16, 2022, 12:25 PM
మహబూబాబాద్ జిల్లా : కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామం సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని టేకులపల్లి మండలం రాజారామ్ తండా కు చెందిన బానోతు రవి (42)అతను తన బంధువు వరసకు వదిన ఇద్దరు ఆదివారం అర్ధరాత్రి తరువాత మహబూబాబాదులో పెళ్లికి వచ్చి, తర్వాత పురుషోత్తమాయ గూడెం పెళ్లికి మోటార్ సైకిల్ పై బానోతు రవి తన వదిన వెళ్ళుచుండగా పెళ్ళికి వచ్చేసరికి బైక్ లో పెట్రోల్ అయిపోయినందున దిగి తన వదిన రోడ్డు పక్కన నడిచారు, రవి బైక్ ను నెట్టుకుంటూ వెళ్తుండగా మహబూబాబాద్ నుండి మరిపెడ వైపు లారీ వెళ్తున్న క్రమంలో డ్రైవర్ లారీని అతి వేగంగా అజాగ్రత్తగా నడిపిస్తూ, బైక్ ను నడిపిస్తున్న బానోతు రవిని వెనుక నుండి ఢీ కొట్టగా అక్కడికక్కడే రవి మృతి చెందాడు.