బీజేపీ సిద్ధం.. టీఆర్ఎస్ సిద్ధమా? కేసీఆర్‌కు అమిత్ షా సవాల్

byసూర్య | Sat, May 14, 2022, 11:00 PM

కేసీఆర్‌కు అమిత్ షా సవాల్ విసిరారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా? అని కేసీఆర్‌కు షా సవాలు విసిరారు. అధికారంలోకి రాగానే ప్రతి గింజా కొంటామని తెలిపారు. తన మాటలు వింటుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని అమిత్‌షా అన్నారు.

రజాకార్ల ఒడిలో కూర్చున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్టు కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. తుక్కుగూడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి అసమర్థ సీఎంను చూడలేదన్నారు. బాయిల్డ్‌ రైస్ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లు రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో కేంద్ర పథకాల పేర్లు మార్చడం తప్ప కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను కేసీఆర్‌ అమలుచేయాలని అన్నారు. వరంగల్‌ సైనిక్‌ స్కూల్‌కు 2016లో అనుమతి ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా తెలిపారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM