byసూర్య | Sat, May 14, 2022, 03:11 PM
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మ నగర్ లో 27. 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 310 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆదివారం ఉదయం 8. 30 గంటలకు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ప్రారంభిస్తారు.
ఇందులో త్రాగునీటి కోసం సంప్ నిర్మాణం తో పాటు, డ్రైనేజీ, సీసీ కెమెరా, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. అంతే కాకుండా లబ్ధిదారుల సౌకర్యార్థం 11 లిఫ్ట్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సౌకర్యాలతో కూడిన పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన ల నుండి పురుడు పోసుకున్నది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కార్యక్రమం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలతో ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుంది.