తల్లి శవం పక్కనే మూడు రోజులుగా కొడుకు...!

byసూర్య | Sat, May 14, 2022, 12:21 PM

తెలంగాణలో దారుణం జరిగింది. హైదరాబాద్‌ లో మూడు రోజులుగా తల్లి శవం పక్కనే కొడుకు ఉన్న ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పూరి కాలనీ మైత్రి నివాస్ అపార్టుమెంట్ లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తల్లి శవం పక్కనే మూడు రోజులుగా ఫ్లాట్లోనే ఆమె కొడుకు సాయి కృష్ణ కూడా ఉండటం కలకలం రేపింది. సాయికృష్ణ కు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు.


తల్లి, కొడుకులు రోజూ గొడవ పడేవారని స్థానికులు తెలుపుతున్నారు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని అపార్ట్ మెంట్ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లి శవం పక్కనే మూడు రోజులుగా కొడుకు ఉండటం స్థానికంగా కలకలం రేపింది. 


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM