నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

byసూర్య | Sat, May 14, 2022, 12:13 PM

హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో శనివారం మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనసమీకరణ చేశారు. ఈ క్రమంలో బీజేపీ సభ ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుక్కుగూడ వచ్చే దారులు బీజేపీ బహిరంగ సభ కారణంగా అధిక రద్దీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చంద్రాయనగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు ప్రత్యమ్నాయ మార్గలు ఎంచుకోవాలి అని సూచించారు. అంతేకాకుండా ఓఆర్ ఆర్ ఎగ్జిట్ నెం. 14 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు అనుతించామని పోలీసులు వెల్లడించారు.

Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM