byసూర్య | Sat, May 14, 2022, 12:10 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన ముస్కు విక్రమ్ రెడ్డి (20) శనివారం ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు కరీంనగర్ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్రెడ్డి బలవన్మరణానికి గాల కారణాలు ఇంకా తెలియరాలేదు.