రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
byసూర్య |
Sat, May 14, 2022, 11:40 AM
బంజారా హిల్స్ కు చెందిన కిషన్ (45), శివకుమార్ (36) లక్ష్మిగూడ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. పీవీ ఎక్స్ప్రెస్వే ర్యాంప్ పైకి వెళ్లారు. ఈ వంతెన పైకి ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. శివకుమార్ వాహనాన్ని నడుపుతుండగా కిషన్ వెనక కూర్చున్నాడు. పిల్లర్ 298 వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. కిషన్ అక్కడికక్కడే మృతి చెందగా శివకుమార్ గాయపడ్డాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Latest News