byసూర్య | Sat, May 14, 2022, 10:02 AM
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం మధ్యాహ్నం 2: 30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడినుంచి రామంతపూర్ బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4 గంటల వరకు రామంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 5 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హోటల్ కు చేరుకుంటారు. 6 గంటలకు బయలుదేరి ప్రజాసంగ్రామ యాత్ర రెండోదశ ముగింపు సభకు హాజరు అవుతారు. 8: 30 గంటలకు తిరిగి డిల్లీ వెళతారు.ఇలా అమిత్ షా పర్యటించనున్నారు.