byసూర్య | Sat, May 14, 2022, 09:16 AM
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరా మండలం చిట్యాల గ్రామంలో దాసరి రాజ్ కుమార్ (25) అనే యువకుడు వడ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఫ్యాన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజ్ కుమార్ తనకున్న వ్యవసాయ పొలంలో వరి ధాన్యం పంటను పండించాడు. వాటిని అమ్ముకునేందుకు ఐకెపి కేంద్రానికి తరలించి అక్కడే ఉన్నాడు. వేరొక రైతు కూలీకి పిలవడంతో వెళ్లి వడ్లు తూర్పార పడుతుండగా ట్రాక్టర్ కున్న మిషన్ ఆఫ్ చేసేందుకు వెళ్లడంతో అతని షర్టుకు ఫ్యాన్ తగిలి మిషన్ లాగడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు తొర్రూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం మృతి చెందాడు. మృతునికి వివాహం జరిగి నాలుగు నెలలు అయింది. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.