byసూర్య | Sat, May 14, 2022, 09:15 AM
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని జఫర్ గడ్ మండలం తిమ్మంపేట శివారులో శుక్రవారం అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై బి. మాధవ్ గౌడ్ తెలిపారు.
శనివారం ఉదయం ఆయన మాట్లాడుతూ కచ్చితమైన సమాచారంతో సిబ్బందితో కలసి దాడిచేసి మట్టిని తరలిస్తున్న 4 ట్రక్కులు, ఒక జేసీబీ, ఒక హిటాచ్ లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమతి లేకుండా మట్టిని, ఇసుకను తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.