నాటుసారా తరలిస్తుండగా పట్టుబడ్డ వ్యక్తులపై కేసు నమోదు

byసూర్య | Sat, May 14, 2022, 09:12 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామ శివారులో నాటు సారా తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఎక్సైజ్ సీఐ ఎం పీ ఆర్ చంద్రశేఖర్. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామం బుగ్గ రాజేశ్వర తండాకు చెందిన అజ్మేరా బాల్ సింగ్ అనే వ్యక్తి శనివారం తన ద్విచక్రవాహనంపై ఐదు లీటర్ల గుడుంబా, 40 కిలోల బెల్లం, 20 కిలోల పటిక స్వాధీనం చేసుకొని అజ్మేర బాల్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ సి. ఐ. ఎం. పి. ఆర్. చంద్రశేఖర్ తెలిపారు.


ఇట్టి నాటుసారాయి తయారు చేసి అల్మాస్ పూర్ స్టేజి వద్ద అమ్ముతున్నానని తెలిపాడు. నాటు సారాయి ముడి సరుకు ఎవరు సరఫరా చేస్తున్నారని బాల్ సింగ్ ను విచారించగా మామిండ్ల రాజు వెంకటాపూర్ వాస్తవ్యులు సరఫరా చేస్తున్నాడని తెలిపినాడు. నాటుసారాయి , మోటర్ సైకిల్ పై, అజ్మేర బాల్ సింగ్, మామిండ్ల రాజు ముద్దాయిలపై కేసు నమోదు చేసినట్లు సి. ఐ. తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ రాజేందర్, రాజు‌ , ప్రధీప్ , మల్లేశ్ , కీషోర్ కుమార్ , దివ్య మరియు లలిత పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Fri, Jun 09, 2023, 09:52 PM
కేసీఆర్ మార్క్ పాలనకు నిదర్శనం,,,.తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు,,,,,మంత్రి సబితా ఇంద్రారెడ్డి Fri, Jun 09, 2023, 09:38 PM
చేప మందు పంపిణీ తో రద్దీ కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు Fri, Jun 09, 2023, 09:37 PM
రెండు, మూడు రోజుల్లో ఏ పార్టీ అనేది క్లారిటీ ఇస్తా,,,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Fri, Jun 09, 2023, 09:36 PM
వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచిన కేసీఆర్,,,మొత్తం రూ. 4116 పెన్షన్ Fri, Jun 09, 2023, 09:36 PM