byసూర్య | Sat, May 14, 2022, 08:59 AM
అందోల్ మండల పరిధిలోని నేరడిగుంట గ్రామంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పత్తి వీరేషం అత్తమ్మ మూడు రోజులు క్రితం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.