byసూర్య | Sat, May 14, 2022, 08:46 AM
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగాయి. గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 17, 206 మంది విద్యార్థులకు గానూ 16, 450 మంది విద్యార్థులు హాజరయ్యారు. 756 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 14, 111 మంది విద్యార్థులకు 13, 564 మంది విద్యార్థులు హాజరుకాగా 547 మంది గైర్హాజరయ్యారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో 3, 095 మంది విద్యార్థులకు 2, 886 మంది విద్యార్థులు హాజరుకాగా 209 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.