తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డేది లేదు: బండి సంజయ్

byసూర్య | Sat, May 14, 2022, 02:17 AM

తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డేది లేదంటూ కేటీఆర్ పంపిన నోటీసుపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌పైనా, త‌న‌పైనా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేస్తానంటూ లీగ‌ల్ నోటీసులు పంపిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ నోటీసుల‌పై తాజాగా బండి సంజ‌య్ ఘాటుగా స్పందించారు. తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డేది లేదంటూ బండి సంజ‌య్ పేర్కొన్నారు. 


మంత్రి కేటీఆర్ వ‌ల్ల 27 మంది ఇంట‌ర్ విద్యార్థులు చ‌నిపోయారంటూ బండి సంజ‌య్ చేసిన ట్వీట్ ఆధారంగానే ఆయ‌న‌కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపిన సంగ‌తి తెలిసిందే. విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లపై ద‌మ్ముంటే సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌ప‌డాల‌ని బండి సంజ‌య్ స‌వాల్ విసిరారు. సీబీఐ విచార‌ణ జ‌రిగితే విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌కులెవ‌రో తెలుస్తుంది క‌దా? అని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే హామీలిచ్చి మోసం చేస్తున్న మీపై 420 కేసులు న‌మోదు చేయాలంటూ సంజయ్ మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM