byసూర్య | Fri, May 13, 2022, 10:01 PM
2019లో ఇంటర్ మీడియట్ రిజల్ట్స్ లో చోటు చేసుకున్న పరిణామాలపై బండి సంజయ్ కేటీఆర్ పై పలు ఆరోపణలు చేశారు. ఈ మేరకు మే 13వ తేదీ శుక్రవారం మంత్రి కేటీఆర్ బిజెపి పార్టీ నేత బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసి నోటీసులు పంపించారు, 48 గంటల్లో కేటీఆర్కి క్షమాపణ చెప్పాలని ఈ నోటీసులతో కేటీఆర్ తరుపు న్యావాది పేర్కొన్నారు.
ఈ నోటీసుల పై స్పందించిన బండి సంజయ్ కేటీఆర్ నోటీసులకు బయపడేదే లే.. అంటూ.. మీ అవినీతిని నిలదీస్తే నోటీసులు పంపుతారా?కావంటే.. ఐక్యరాజ్య సమితికి కూడా ఫిర్యాదు చేస్కో అంటూ కేటీఆర్ కు సంజయ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. అసలు కేటీఆర్ కుటుంబం పై 420 కేసులు పెట్టాల్సి వస్తున్నదన్నారు. గతం లో ఇంటర్ విద్యార్థుల మరణాల పై స్పందించని కేటీఆర్ ఇప్పుడెందుకు భుజాలు తడుముకుంటున్నాడో తెలపాలన్నారు. కేటీఆర్ కు గ్లోబరీనా సంస్థ తో సంబంధం ఉందొ లేదో కేటీఆర్ తెలపాలన్నారు.