ఈ నెల 20వ నుంచి 'పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి' కి శ్రీకారం

byసూర్య | Fri, May 13, 2022, 09:38 PM

తెలంగాణలో చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు. ప్రగతి భవన్‌ వేదికగా బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీవోలు, అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.

ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 5వ విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చేపట్టనున్నారు. కార్యక్రమాల నిర్వహణపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్​ చర్చిస్తారు. ఇప్పటి వరకు అమలైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM