byసూర్య | Fri, May 13, 2022, 09:31 PM
రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 60.18 లక్షల విలువైన 1500 కిలోల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం తరలిస్తుండగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులు కడప నుంచి హైదరాబాద్కు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. నిందితులు మౌలాలిలోని ఖాళీ స్థలంలో ఎర్రచందనం నిలువ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.